ఒలింపిక్స్ కాంస్య విజేత పీవీ సింధుకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘన స్వాగతం పలికారు. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సీపీ సజ్జనార్కు పీవీ సింధు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఒలింపిక్స్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజయం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపిందని అన్నారు. అటు సింధు మట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పింది.
#WATCH | Telangana: Olympic #BRONZE medallist PV Sindhu and her coach Park Tae-Sang reach Sindhu's residence in Hyderabad pic.twitter.com/HqfU6E8vPb
— ANI (@ANI) August 4, 2021