నాని హీరోగా, కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాని నిర్మాత అల్లు అరవింద్ షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. తెలుగు ‘జెర్సీ’ని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ తెరకెక్కించారు.

నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘దిల్’ రాజు, అమన్ గిల్, ఎస్. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. షాహిద్ కపూర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 5న ‘జెర్సీ’ సినిమాను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ఫెంటాస్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ను షేక్ చెయ్యడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా తెరకెక్కించి బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్, జెర్సీ సినిమా మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతున్నాడు.