దీన్ని చూసిన నెటిజన్లు ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే అద్భుతమైన ఫొటో అని మెచ్చుకుంటున్నారు. తండ్రి గెలుపు కోసం కుమార్తె అమాయకంగా దేవుడిని ప్రార్థిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే జీవా ప్రార్థనలు ఏవీ ఫలించినట్లు లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ధోనీ సారధ్యంలోని చెన్నై జట్టు ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్లో అంబటి రాయుడు (55) అర్థశతకంతో రాణించాడు. అయితే ఈ స్వల్ప లక్ష్యం ఢిల్లీ బ్యాట్స్మెన్ల ముందు నిలవలేదు. ధావన్ (39), హెట్మెయర్ (28 నాటౌట్) ధాటికి 19.4 ఓవర్లలో టార్గెట్ ఛేజ్ చేసిన ఢిల్లీ జట్టు విజయకేతనం ఎగురవేసింది.