జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్’ అంటూ 2006 మార్చి 21వ తేదీన ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సీ చేసిన తొట్టతొలి ట్వీట్ను అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ట్విట్టర్ కోట్లాదిమంది జీవితాల్లో భాగస్వామ్యమైంది. అందులోను సహ వ్యవస్థాపకుడి తొలి ట్వీట్కు వేలంలో భారీ డిమాండ్ వచ్చింది. అందరి జీవితాల్లో భాగమైన ట్విటర్లో మొటి ట్వీట్ ప్రత్యేకమే. అందుకే దీనిని జాక్ డోర్సీ ‘వాల్యుయబుల్స్ బై సెంట్’ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ వేదికగా తెలిపారు. ఇప్పటి వరకు లక్షల మంది ఈ ట్వీట్ కొనుగోలుకు మొగ్గు చూపారు. ఎంతోమంది బిడ్స్ దాఖలు చేశారు. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. మన కరెన్సీలో ఇది రూ.18.30 కోట్లు.
ఈ ట్వీట్ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందిస్తారు. ఆ పత్రంలో ట్వీట్తో పాటు అది పోస్ట్ సమయం తదితర వివరాలు ఉంటాయి. ఈ ట్వీట్కు ఎంతోమంది లక్షల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.