అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ రాష్ట్రం బయటకు తరలి పోతోందన్న వార్తలను ఏపి ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల ఖండించారు. అమర్ రాజా బ్యాటరీస్ కొంత కాలంగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందనీ అన్నారు. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టకపోవడం తోనే పరిశ్రమకు నోటీసులిచ్చామని అన్నారు. హై కోర్టు కూడా అమర్ రాజా తీరును తప్పుబట్టిందన్నారు.