సంతోష్ శోభన్ – మెహ్రీన్ జంటగా మారుతి దర్శకత్వంలో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా రూపొందింది. ఎస్.కె.ఎన్. బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. అజయ్ ఘోష్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. దీపావళి సందర్భంగా వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. కామెడీ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కరోనా నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా ఇది. ఈ సినిమాలో అజయ్ ఘోష్ కూతురిగా మెహ్రీన్ కనిపించనుంది. ఆయన కళ్లుగప్పి సాగించే ప్రేమాయణమే ఈ సినిమా.మారుతి చాలా తక్కువ ఖర్చుతో .. చాలా తక్కువ రోజులలో రూపొందించిన సినిమా ఇది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో మెహ్రీన్ ఉంది.