రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన విలేజ్ డ్రామా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. ఇప్పుడు తమిళ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడులో 300లకు పైగా స్ర్కీన్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలియజేసింది. కోలీవుడ్లోనూ ‘రంగస్థలం’ పేరుతోనే విడుదలకానుంది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆదిపినిశెట్టి ఆకట్టుకున్నారు. ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థ 7జీ ఫిల్మ్స్. ఎనిమిదేళ్ల తర్వాత తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని తప్పక ఆకట్టుకుంటుందని 7జీ ఫిల్మ్స్ భావిస్తుంది.
We are bringing #Rangasthalam (Tamil) this April 30 to theatres@MythriOfficial @AlwaysRamCharan @Samanthaprabhu2 @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/u2PHiFJK9Z
— 7G Films (@7GFilmsSiva) April 18, 2021