తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ నెల 9న హైదరాబాదులో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ కీలక సమావేశానికి హైదరాబాద్ అజీజ్ నగర్లోని జేపీఎల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలవనుంది. తెలంగాణలో జనసేన కార్యకలాపాలు విస్తృతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజల పక్షాన నిలిచి పోరాడడంపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారు.