కరోనా పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇండియాలో OTT ల హవా మొదలైంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి సంస్థలు లోకల్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా కొత్త ప్రయోగాలు చేస్తూ సినిమాలతోనే కాకుండా వెబ్ కంటెంట్ తో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ ని రిలీజ్ కి రెడీ చేసింది. ఆధునిక స్వతంత్ర్య భావాలు కలిగిన మహిళల గురించి ఒక కథా సంకలనాన్ని రూపొందించారు. దీని కోసం ప్రతిభావంతులైన టాలీవుడ్ దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ మరియు సంకల్ప్ రెడ్డిలను ఒక చోట చేర్చింది నెట్ ప్లిక్స్.
నెట్ ఫ్లిక్స్ తాజాగా తన మొదటి ఒరిజనల్ తెలుగు ఆంథాలజీ సిరీస్ పేరు ‘పిట్టకథలు’ అని అధికారికంగా ప్రకటించింది. ఈ నాలుగు భాగాల ఆంథాలజీ చిత్రానికి నలుగురు అత్యుత్తమ దర్శకులు దర్శకత్వం వహించారని పేర్కొంది. సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను పిట్టకథలు అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల నలుగురు మహిళల గురించి తెలియజేస్తుంది. ఈ నాలుగు పాత్రల్లో ఈషా రెబ్బా, మంచు లక్ష్మి, అమలా పాల్, శృతిహాసన్ నటించారు. వీరితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అషిమా నర్వాల్, జగపతిబాబు, సత్యదేవ్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్దే వంటి టాలీవుడ్ ఆర్టిస్టులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ‘పిట్టకథలు’ మొత్తం 190 దేశాలలో నెట్ ప్లిక్స్ లో ఫిబవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటిస్తూ దీనికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు
రాముల – మంచు లక్ష్మి – తరుణ్ భాస్కర్
‘మీరా’ – జగపతిబాబు, అమలా పాల్ – నందిని రెడ్డి
‘ఎక్స్ లైఫ్’ – శృతి హాసన్ – నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.
‘పింకీ’ – ఈషా రెబ్బా, సత్యదేవ్ – సంకల్ప్ రెడ్డి