Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. 10 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను నారాలోకేష్ విడుదల చేశారు. పేదలకు ఐదు రూపాయలతో నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. ఆటో డ్రైవర్ల కోసం ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ వీధిలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.