కరోనా పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులు దారుణంగా దోచుకుంటున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయారని చెప్పారు. కరోనాకు ఇప్పటి వరకు సరైన మందు లేదని.. ఈ నేపథ్యంలో ఆనందయ్య తమతో చేతులు కలపాలని కోరారు. ఆనందయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆనందయ్యతో కలిసి కరోనా మందు తయారీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని కేఏ పాల్ చెప్పారు. మందు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తెచ్చుకుంటే… మందు తయారీ చేసుకుని వెళ్లొచ్చని సూచించారు. మందు తయారీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు తాము చేస్తామని తెలిపారు. ఆనందయ్య బయటకు రాగానే అన్ని విషయాలను మాట్లాడతానని చెప్పారు. రక్షణ పేరుతో ఆనందయ్యను ఏపీ ప్రభుత్వం బంధించిందని మండిపడ్డారు.