వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం ఒకటిన్నర నెల మాత్రమే డేట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు మార్చి నెలకి పవన్ కళ్యాణ్ పాత్ర వరకు షూటింగ్ పూర్తవుతుంది.
ఈ రీమేక్ అనంతరం, పవన్ కళ్యాణ్ – క్రిష్ ల సినిమా మొదలవుతుంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపిక అవ్వగా మరో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాడెజ్ ను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా ఈ వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఇప్పుడు క్రిష్ అధికారికంగా ఆమెను కన్ఫర్మ్ చేశాడని తెలుస్తోంది. సాహో సినిమాలో బాడ్ బాయ్ అనే ప్రత్యేక గీతంలో కనిపించిన జాక్వలిన్ ఈ సినిమాతో పూర్తి స్థాయి పాత్రతో ఆకట్టుకోబోతుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె పవన్ తో సినిమా తర్వాత టాలీవుడ్ లో కూడా బిజీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.