టీమిండియా స్టార్ పేసర్, స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఈరోజు ఓ ఇంటివాడు అయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్ని ఈ రోజే గోవాలో బుమ్రా వివాహం చేసుకున్నాడు.
అయితే కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. మొబైల్ ఫోన్స్ని కూడా తీసుకురావొద్దని అతిథుల్ని బుమ్రా, సంజనా రిక్వెస్ చేశారట. కరోనా నేపథ్యంలో 20 మంది మాత్రమే అతిథులు వచ్చారు.
వివాహం తర్వాత 27 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా.. భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి విందు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. తర్వాత జర్నలిస్ట్గా మారి ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా సీజన్7తో తన కెరీర్ ప్రారంభించారు. సంజన ప్రస్తుతం ఐపీఎల్ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్కి కూడా స్పోర్ట్స్ ప్రజెంటర్గా సంజనా పనిచేశారు.
సంజనాకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్గా నిలిచారు. అలాగే 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 1.43 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు బుమ్రాను పెళ్లి చేసుకుంటుందనే వార్తలతో సంజన మరింత ఫేమస్ అయ్యారు