నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ‘మా’ ఎన్నికలకి సంబంధించి తాను దాఖలు చేసిన నామినేషన్ని ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. ‘నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను జనరల్ సెక్రటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నా’ అని పేర్కొన్నారు. ప్రకాశ్రాజ్, శ్రీకాంత్తో దిగిన ఫొటోని పంచుకున్నారు. కొన్ని కారణాల వల్ల ప్రకాశ్రాజ్ ప్యానల్ సిని‘మా’బిడ్డలం నుంచి గణేశ్ బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. దాంతో జనరల్ సెక్రటరీ పదవి కోసం ఇండిపెండెట్గా పోటీ చేయలనుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల నామినేషన్ వేశారు. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబరు 10న జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, ప్రకాశ్రాజ్, సీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు.