చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసు, తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడించింది. మూఢనమ్మకాలతో తల్లిదండ్రులు తమ పిల్లలను తామే హతమార్చినట్లుగా మొదట పోలీసులు తేల్చారు. అయితే దానికి గల కారణాలను విచారణ తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.
సొంత బిడ్డలను కన్నవారే హత్య చేసిన ఘటనలో దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ హత్యలకు పెద్దమ్మాయి అలేఖ్య చర్యలే కారణమన్న కొత్త అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు. పునర్జన్మలపై విశ్వాసంతో అలేఖ్య తను తల్లిదండ్రులకు ఇచ్చిన సలహాలే హత్యలకు దారి తీసిందని భావిస్తున్నారు.
ఉన్నత చదువులు చదువుకున్న పెద్ద కూతురు అలేఖ్య గురించి దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. అలేఖ్యే తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్ఫ్లుయన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. చెల్లి దివ్యకి దెయ్యం పట్టిందని చెప్పి కొట్టటంతో ఆమె చనిపోయిందని తరువాత చెల్లెలి ఆత్మను నేను బంధించాను…ఆ ఆత్మను తిరిగి చెల్లెలి తనను కూడా చంపితే..తన ఆత్మ వెళ్లి చెల్లెలి ఆత్మకు తీసుకొస్తుందని చెప్పి తల్లిదండ్రుల్ని పూర్తిగా నమ్మించింది అన్న వార్తలు వస్తున్నాయి.
అంతేకాక, తనను ఎలా చంపాలి? ఎక్కడ చంపాలి? అనే విషయాలన్నీ తల్లికి చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే తల్లి పద్మజ..తండ్రి పురుషోత్తం, తాను కలిసి నగ్నంగా మారి పూజలు చేశారు. ఆ తరువాత అలేఖ్య చెప్పినట్లుగానే అలేఖ్య నోటిపై రాగి చెంబు పెట్టి..దాంట్లో నవధాన్యాలు పోసి డంబెల్స్ తో అలేఖ్య తల పగులగొట్టి చంపింది తల్లి..!!
తమ పెద్ద కూతురు అలేఖ్య మాటలను గుడ్డిగా నమ్మిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు… ఈ జంట హత్యలకు కారణమయ్యారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబమంతా ముందునుంచే ఓ తెలియని భయం, భ్రమలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యల వెనుక మూడో వ్యక్తి ప్రమేయంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు సేకరించలేదు.
అక్కాచెల్లెళ్ల హత్య ఘటనలో కీలక అంశాలను మదనపల్లికి చెందిన మంత్రగాడు వెలుగులోకి తెచ్చాడు. ఘటన జరగడానికి ముందు రెండు రోజులు ముందు వారి ఇంటికి వెళ్లినట్టు సుబ్బారావు తెలిపాడు. పెద్ద కూతురు అలేఖ్యకు ఆరోగ్యం బాగలేదని చెప్పడంతో తాయెత్తు వేసినట్లు చెప్పారు. ఘటన జరిగిన రోజు రమ్మని పిలిచారని.. అయినా వెళ్లలేదన్నాడు సుబ్బారావు. తాను వెళ్లిన సమయంలో మరో వ్యక్తి ఇంట్లో ఉన్నాడని… అలేఖ్య ఎదురుగా అతను శంఖం ఊదుతున్నాడని సుబ్బారావు తెలిపాడు.
ఇక ప్రస్తుతం జైలులో ఉన్న పద్మజా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదంటున్నారు జైలు సిబ్బంది. జైలులో ఉన్న పద్మజ, పురుషోత్తం నాయుడు దంపతులను మరి కాసేపట్లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించనున్నారు. నిందితులిద్దరికీ మరోసారి మానసిక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.