ఈమధ్య ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్ తీసుకొచ్చిన తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రైవసీ పరంగా ఇబ్బందులు ఉంటాయని యూజర్లంతా కొత్త యాప్ లకు స్విచ్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, అందరితో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద గ్రూపులు కూడా వాట్సాప్ వదిలేస్తున్నాయట. వాట్సాప్ మెసెంజర్ మరియు ఫేస్బుక్ మెసెంజర్ ను ప్రైవసీ కారణాల వల్ల వాడకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కొందరు ఉగ్రవాదులు ఆర్మీకి ఇచ్చిన వివరాల్లో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపుల రాడికలైజేషన్ గురించి బయటపెట్టారు. అయితే ఏయే అప్లికేషన్లకు ఉగ్రవాద గ్రూపులు స్విచ్ అవుతున్నారు అనే విషయాన్ని భద్రతా కారణాల రీత్యా బహిర్గతం చేయలేదు.
ఐతే ఒక టర్కీష్ కంపెనీ మెసెంజర్ డెవలప్ చేసిన అప్లికేషన్ ను కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నియామకాల కోసం వాడుతున్నట్లు సమాచారం.