వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకుడు. రాజీవ్ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్ని విడుదల చేసింది. పల్లె వాతావరణాన్ని తలపించే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రవీంద్ర యాదవ్గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మగా రకుల్ ఆకట్టుకుంటున్నారు. ఈ జోడీ ట్రైలర్కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.