తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ నిర్మాత కొరటాల సందీప్ మృతిచెందారు. ఆయన వయసు కేవలం 39 ఏళ్లు. గుంటూరు జిల్లాలోని బాపట్లలో తన నివాసంలో ఉన్న నిర్మాతకు ఆదివారం ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికై సందీప్ చనిపోయినట్లు ధ్రువీకరించారు.
నారా రోహిత్తో రౌడీ ఫెలో, నిఖిల్తో స్వామిరారా, వీడు తేడా లాంటి సినిమాలు నిర్మించిన సందీప్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. విభిన్న కథాంశాలకు ప్రాధాన్యమిచ్చే సందీప్ చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడం పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సందీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీడీపీ నేతగానూ సందీప్ సేవలు అందించారు. పలువురు టీడీపీ నేతలు, జిల్లా నేతలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు నిర్మాత సందీప్ కొరటాకు నివాళులు అర్పించారు. తన నిర్మాత సందీప్ ఆకస్మిక మరణంపై నటుడు నారా రోహిత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.
Saddened to learn that my #RowdyFellow co-producer & my well wisher Sandeep Koritala is no more. This was such a terrible start for the day. ఓం శాంతి !! pic.twitter.com/3UC4IP5mfz
— Rohith Nara (@IamRohithNara) February 28, 2021