తమన్నా ఫస్ట్ టైమ్ `లెవెన్త్ అవర్` అనే వెబ్సిరీస్లో మెరిసింది.ఇది ఇటీవల `ఆహా`లో ప్రసారమైంది. ప్రవీణ్ సత్తార్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్కి మిశ్రమ స్పందన లభించినా, స్టార్ హీరోయిన్ అయిన తమన్నా అప్పియరెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. దీంతో ఇప్పుడు మరో వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతుందట `ఆహా` కోసం ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్వహకులు తమన్నాని సంప్రదించగా అందుకు ఆమె ఓకే చెప్పిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.దీనిపై దర్శకుడు వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
దీంతోపాటు తమన్నాతో ఓ టాక్ చేయాలని కూడా `ఆహా` నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ సమంతతో ఇప్పటికే `సామ్జామ్`టాక్ షో చేసిన విషయం తెలిసిందే. దీనిలో స్టార్లు పాల్గొని సందడి చేశారు. సమంత సైతం తనదైన స్టయిల్లో షోని రక్తికట్టించింది. ఇప్పుడు తమన్నాతో దాన్ని మించి చేయాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకు హోస్ట్ గా తమన్నాని ఎంపిక చేయాలని భావిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికి తమన్నా సినిమాలతోపాటు వెబ్సిరీస్తోనూ బిజీగా కాబోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు గోపీచంద్ తో `సీటీమార్` చిత్రంలో నటిస్తుంది.ఇందులో జ్వాలారెడ్డిగా తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కోచ్గా కనిపించబోతుంది.దీంతోపాటు వెంకీతో `ఎఫ్3`, నితిన్తో `మ్యాస్ట్రో`, సత్యదేవ్తో `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.