విశాఖను వైసీపీ ప్రభుత్వం అమ్మేయ్యడానికి చూస్తుందని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. అప్పులు చెల్లించడానికి ఆర్ అండ్ బీ ఆస్తులు 5వేల కోట్లకు అమ్మడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 శాఖలకు చెందిన 213 ఎకరాల భూములను 16 వందల కోట్లకు అమ్మడానికి సిద్ధం కావడం దారుణమని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో విచ్చల విడిగా ఆస్తులు అమ్మడం సరైన పద్దతి కాదని హెచ్చరించారు.