సమంతతో సామ్జామ్, రానా దగ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్తో, రవితేజ బ్లాక్బస్టర్ క్రాక్, అల్లరి నరేష్ నాంది వంటి డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేస్తున్న ‘ఆహా’ ఇప్పుడు థ్రిల్లర్ మూవీ ‘వై’తో ప్రేక్షకులను అలకరించడానికి సిద్ధమైంది. శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన థ్రిల్లర్ సినిమా ‘వై’. ఈ మూవీ ‘ఆహా’లో ఏప్రిల్ 2న విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర విడుదల చేశారు.
‘వై’ సినిమా థియేటర్లో విడుదలైతే ఎంత రెస్పాన్స్ వస్తుందో.. ఈరోజు అలాంటిర రెస్పాన్స్ రావడానికి కారణం ముఖ్యంగా ఆహా అండ్ టీం అంటూ చెప్పుకోచ్చారు ఆ చిత్ర నిర్మాత ఏరు కొండ రఘురామ్. డైరెక్టర్ బాలుగారితో జర్నీ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనతోనే కంటిన్యూగా సినిమాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. వికాస్ అల్టిమేట్ మ్యూజిక్ అందించారు. మంచి టీమ్ కుదిరింది. అందరికీ థాంక్స్” అన్నారు. ఇక డైరెక్టర్ బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ “‘ఆహా’ టీమ్కు ధన్యవాదాలు. చిన్న సినిమాలకు ఆహా గొప్ప వేదికగా మారుతుంది. వారితో నెక్ట్స్ సినిమా కమిట్మెంట్ కూడా ఉంది. రాహుల్, శ్రీరామ్గారు లేకపోతే నా సినిమా లేదు. నాకంటే ఈ సినిమా కోసం వాళ్లే ఎక్కువగా కష్టపడ్డారు. నిర్మాత రఘురామ్గారు ఏదడిగినా కాదనకుండా సపోర్ట్ చేస్తూ వచ్చారు.ఏప్రిల్ 2న విడుదలవుతున్న మా ‘వై’ సినిమాకు అందరూ సపోర్ట్ అందించాలని కోరుతున్నాం” అన్నారు. నేను ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమాలో నటించడం ఇదే తొలిసారి. శ్రీరామ్గారితో పోటీ పడి నటించాను అని చెప్పారు రాహుల్ రామకృష్ణ. ఇక ఆ తర్వాత హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. రాహుల్ రామకృష్ణ మంచి కోస్టార్.బాలుగారి దర్శకత్వంలో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం. నిర్మాత రఘురామ్గారి సపోర్ట్తోనే సినిమాను పక్కా ప్లానింగ్తోనే పూర్తి చేశాం అంటూ చెప్పుకోచ్చారు. ఈ సినిమాలో శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్, జెమినీ సురేష్, టీఎన్ఆర్, రఘుబాబు, కత్తి మహేశ్ కీలక పాత్రలు పోషించారు.