ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ( రౌద్రం రణం రుధిరం) షూటింగ్ను పూర్తిచేసుకుంది. ఎన్టీఆర్, రామ్చరణ్లతో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా ఉక్రెయిన్లో కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కించారు. ఉక్రెయిన్ షెడ్యూల్ను ముగించుకున్న చిత్రబృందం హైదరాబాద్కు తిరిగొచ్చింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేస్తూ తన టీమ్తో దర్శకుడు రాజమౌళి తీయించుకున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ చారిత్రక ఇతివృత్తాలకు కాల్పనిక అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. దాదాపు 450 కోట్ల భారీ వ్యయంతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అలియాభట్, ఒలీవియామోరిస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అజయ్దేవ్గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్ని పోషించారు. కీరవాణి సంగీతాన్నందించారు.
#RRRMovie Entire Shoot Has Been Completed 🌊
Here are the pics of Wrap Party#ManOfMassesNTR | @tarak9999 #KomaramBheemNTR pic.twitter.com/jVoquh8cCu
— Team Jr NTR 🌊 (@JrNTRonline) August 18, 2021