మెగాపవర్స్టార్ రామ్చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ మొదలు కాకుండా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినిమాపై ఇంత ఎక్స్పెక్టేషన్స్ రావడానికి కారణమెవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే..మెగాపవర్స్టార్ను డైరెక్ట్ చేయబోయేది సౌతిండియాలో మరో అగ్ర దర్శకుడిగా పేరున్న శంకర్. హిట్ చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్రాజు అన్ కాంప్రమైజ్డ్గా సినిమాను నిర్మిస్తున్నాడు. శంకర్ చాలా రోజుల క్రితమే తాను ఇండియన్ 2 తర్వాత సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తానని చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. అంటే రామ్చరణ్తో ఇప్పుడు శంకర్ చేయబోయేది సైన్స్ ఫిక్షన్ మూవీ అనే అనుకోవాలి.
ఈ సినిమాలో ఎవరు హీరోయిన్గా నటిస్తారు? అనే దానిపై కూడా పలు వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా రామ్చరణ్ జోడీగా రష్మిక మందన్న నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శాండివుడ్ బ్యూటీ ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ పుష్పలో బన్ని సరసన నటిస్తుంది. దీని వెంటనే రామ్చరణ్, శంకర్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తానని చెప్పిందట. ఇది కనుక జరిగితే రష్మిక మందన్న స్టార్ హీరోయన్గా మరో రేంజ్కు చేరుకున్నట్లే.