సౌత్ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకులలో శంకర్ ఒకరు.ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒకే ఒక్కడు నేపథ్యంతో సాగే పొలిటిక్ డ్రామా అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రాబోయే ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
జిగర్తాండా, పెట్ట మరియు జగమే తంతిరం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథ అందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఆయన తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు అనే రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. చెల్లముత్తు .. కార్తీక్ దగ్గర దర్శకత్వ శాఖాలో పని చేశారు. నా కథని కార్తీక్ కాపీ కొట్టాడని చెల్లముత్తు ఆరోపిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే దర్శకుడు శంకర్ టైం అస్సలు బాగోలేదు.మొన్నటి వరకు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్తో శంకర్ ఇబ్బంది పడ్డాడు. మరోవైపు ‘అపరిచితుడు’ రీమేక్ వివాదం కూడా ఎదుర్కొన్నారు శంకర్. తాజాగా.. రామ్చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు ఆరోపిస్తుండడంతో శంకర్ సినిమా మరోసారి వార్తలలోకి ఎక్కింది.