మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల అవనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతకాలపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు ఈ సినిమాలో కథానాయికలుగా మెరవబోతున్నారు.
https://twitter.com/AlwaysRamCharan/status/1448247583327997952?s=20