ఆంధ్ర ప్రదేశ్ : అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన జరిగినప్పటి నుంచి చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విరాళాలను ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయంగా 30 లక్షలను ఈ మహా కార్యం కోసం విరాళం ఇచ్చారు. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి విరాళం అందజేసినట్లుగా ఈ సంధర్భంగా వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ గారు, కార్యక్రమం అనంతరం ఈ విరాళం ప్రకటించారు. ఏడాదికాలంగా తిరుపతికి రావాలని అనుకుంటున్నానని, కరోనా కారణంగా కుదరలేదని పవన్ చెప్పారు.