మెగా ఫ్యామిలీలో హీరోల మార్కెట్ రోజురోజుకు అకాశాన్ని తాకుతోంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్స్ బాక్సాఫీస్ వద్ద వారికాంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నారు. ఇక త్వరలోనే వారి నుంచి వారుసగా సినిమాలు రాబోతున్నాయి. ఆచార్య సినిమా ద్వారా మెగా మల్టీస్టారర్ ను చూపించబోతున్నారు. ఇక త్వరలో మెగాస్టార్, చరణ్ తో కలిసి పవన్ కూడా ఒక వేడుకలో సందడి చేయబోతున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆజ్ఞాతవాసి అనంతరం చాలా గ్యాప్ తరువాత చేసిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోగలదని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు ఇప్పటికే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వగా దిల్ రాజు ప్రమోషన్ డోస్ ను ఇంకాస్త పెంచేస్తున్నారు. ప్రమోషన్ కోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా తప్పకుండా 100కోట్ల బిజినెస్ చేయగలదని ఇప్పటికే ఒక టాక్ వైరల్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై మరింత అంచనాలను పెంచాలని చూస్తున్నారు.
ఇక వకీల్ సాబ్ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. గత ఎడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు సాంగ్స్ కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేశాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా అగ్ర తారలు వస్తున్నట్లు న్యూస్ లీక్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా తనయుడు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ఇక వకీల్ సాబ్ ఈవెంట్ లో ఆ దృశ్యాలు కనిపించబోతున్నాయి. రామ్ చరణ్, చిరు ముఖ్య అతిధులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు సమాచారం. దిల్ రాజుతో పాటు బాలీవుడ్ నిర్మాత బోణికపూర్ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.