పవన్ కళ్యాణ్ రానా ప్రధాన పాత్రల్లో మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింది. ఇక తాజాగా ఈ సినిమాలో నిత్యామీనన్ ఎంటర్ అయ్యింది. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నిత్యా మీనన్ ఈసినిమాలో పవన్ సరసన.. ఆయన భార్యగా నటించనుందని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్గా కనిపించనున్నారు. ఈ సినిమాకు పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
We are extremely delighted to welcome an exceptional & proficient talent @menennithya on board for our #ProductionNo12 ⭐#BheemlaNayak Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/xxfRx8znFZ
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2021