పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అంటున్నారని… నువ్వు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చావు కదా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా పార్టీ మారారని… ఆయనను కూడా రాళ్లతో కొట్టాలా? అని ప్రశ్నించారు. చిన్న పదవి రాగానే రేవంత్ పెద్ద బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో పాదయాత్రల సీజన్ రాబోతోందని… పాదయాత్రలు చేయండి, ఆరోగ్యం కూడా బాగుంటుందని విపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ పల్లెల్లో ఎలాంటి అభివృద్ది జరిగిందో బండి సంజయ్ పాదయాత్రలో చూడాలని అన్నారు. తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా జరిగిందా? అని ప్రశ్నించారు.