కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినిమాల షూటింగులు ఆగిపోయాయి. బాలీవుడ్కు సంబంధించిన ఎక్కడి కార్యక్రమాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చిత్రబృందాలు తమ సినిమాల్ని సెట్స్పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రణ్బీర్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా లవ్ రంజన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ షూటింగులు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే లవ్ రంజన్ తన చిత్రాన్ని ఈ నెల 20 నుంచి సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. దిల్లీ లేదా ఉత్తరప్రదేశ్ల్లో ఈ సినిమా మూడో షెడ్యూల్ను పూర్తిచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోని కొన్ని సన్నివేశాలను స్పెయిన్లో తీయనున్నారు. ఇండియాలో చిత్రీకరణ పూర్తయ్యాకా స్పెయిన్కు వెళ్లాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. ఇందులో రణ్బీర్ తల్లిదండ్రులుగా డింపుల్ కపాడియా, బోనీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.