కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వీరవిజృంభణలో ఎంతోమంది కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రణాంతక వైరస్ ఎందరో జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంటోంది. తాజాగా ప్రముఖ సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఫ్రాంక్లీ స్పీక్ విత్ TNR అనే పేరుతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇంటర్వూస్ చేశారు TNR. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పలువురి చేత భేష్ అనిపించుకున్న ఆయన.. పలు సినిమాల్లోనూ నటించారు. ఆయన పూర్తిపేరు తుమ్మల నరసింహా రెడ్డి.
TNR మరణవార్త తెలిసి హీరో నాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ”TNR కన్నుమూశారని తెలిసి షాకయ్యా. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి మనసులో మాటలను జనానికి వినిపించిన ఆయన మరణం బాధాకరం” అని నాని పేర్కొన్నారు.
”స్క్రీన్ షేర్ చేసుకున్నాం. స్టేజ్ షేర్ చేసుకున్నాం. కలిసినప్పుడల్లా, ‘నీతో అందరూ ఇంటర్వ్యూలు చేసేసారు. నేను ఎప్పుడో చేస్తాను. అది చాలా స్పెషల్గా ఉండాలి, ఉంటుంది’ అనేవాడు. దర్శకుడు అవుదామని వచ్చాడు. ఇరవైఏళ్లుగా ఏవేవో చేసాడు. ఇంటర్వ్యూయర్గా చాలా ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో యాక్టర్గా విజృంభణలో ఉన్నాడు. త్వరలో దర్శకత్వం అన్నాడు. కానీ ఇలా ఈ లోకం విడిచి వెళ్లాడు” అని కత్తి మహేష్ ఆవేదన చెందాడు.
Shocked to hear that TNR gaaru passed away .. have seen few of his interviews and he was the best when it came to his research and ability to get his guests to speak their heart out . Condolences and strength to the family 🙏🏼
— Nani (@NameisNani) May 10, 2021