అగ్నిప్రమాదం జరిగినప్పుడు ‘ఆదిపురుష్’ సెట్లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్కు సంబంధించిన వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజే ప్రారంభంకావడం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ముంబైలో ప్రారంభమైంది. నగరంలోని గోరేగావ్లో ఉన్న ఇనార్బిట్ మాల్ వెనుక రెట్రో గ్రౌండ్స్లో చిత్రీకరణ జరుపుతున్నారు. షూటింగ్లో 50 నుంచి 60 మంది టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అయితే, సాయంత్రం 4:13 గంటల సమయంలో సెట్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటలను అదుపుచేయడానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్కు చెందిన ఒకరు వెల్లడించారు.
భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ముంబైలో ప్రారంభమైంది. నగరంలోని గోరేగావ్లో ఉన్న ఇనార్బిట్ మాల్ వెనుక రెట్రో గ్రౌండ్స్లో చిత్రీకరణ జరుపుతున్నారు. షూటింగ్లో 50 నుంచి 60 మంది టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అయితే, సాయంత్రం 4:13 గంటల సమయంలో సెట్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటలను అదుపుచేయడానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్కు చెందిన ఒకరు వెల్లడించారు.
కాగా, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్టు ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక పోస్టర్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే, తొలిరోజే ‘ఆదిపురుష్’ సెట్స్లో అగ్నిప్రమాదం జరగడం పట్ల ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ, హీరో మంచు మనోజ్ అస్సలు బాధపడొద్దని అంటున్నారు. దిష్టి పోయిందని అనుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ఎవ్వరూ గాయపడనందుకు దేవుడికి ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నారు