కరోనా కష్టకాలంలో అడిగిన వారందరికీ నేనున్నానంటూ సాయం చేసి, రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చారు. కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నారు. సోనూ సాయం పొందిన వారు, ఆయన మంచితనాన్ని గుర్తించిన వారూ ఏదో విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో పలు దుకాణాలకు, కొందరు చిన్నారులకు ‘సోనూ’ పేరు పెట్టుకున్నారు. మరికొందరు పాద యాత్ర చేసి సోనూపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల.. ఉమాసింగ్ అనే ఓ అభిమాని సోనూపై తనకున్న ఇష్టాన్ని సాహసోపేతంగా తెలియజేశాడు. సైక్లిస్ట్, మౌంటైనర్ అయిన ఉమాసింగ్ ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతం పైకి చేరుకొని సోనూసూద్, త్రివర్ణ పతాకం ఉన్న ఫొటోను ప్రదర్శించారు. ‘ది రియల్ హీరో ఆఫ్ ఇండియా’ అంటూ సోనూసూద్ని అభివర్ణించాడు. ఈ దృశ్యాల్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల వేదికగా ఉంచాడు. దీనిపై సోనూ స్పందించారు. ‘వావ్.. నేనూ కిలిమంజారో పర్వతం అధిరోహించాననుకుంటున్నా. చాలా గర్వంగా ఉంది ఉమ’ అని అన్నారు.
Wowwwww.
Now I can say that I have been to Mt. Kilimanjaro 😄
So proud Uma 🇮🇳 https://t.co/W6qmJthbwn— sonu sood (@SonuSood) August 17, 2021