దేశాన్ని కరోనా ఎలా అతలాకుతలం చేస్తోందో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల మందిని కబళిస్తోంది. వేల మంది ప్రాణాలను ఈ మహమ్మారి బలిగొంటోంది. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు రకరకాల పోస్టులతో సోషల్ మీడియాలో పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ హీరోయిన్ కూడా కరోనాపై ఓ పోస్ట్ పెట్టింది. అయితే అందరిలా కాకుండా కరోనాపై ఓ కవిత రాసి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ కవిత తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ కవితకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కరోనా విలయాన్ని కవిత రూంపలో చక్కగా చెప్పారంటూ సదరు హీరోయిన్ను అభినందిస్తున్నారు.
ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, కరోనాతో పోరాటం కోసం వారిలో నైతిక ధైర్యం నింపేందుకు అనేకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేకమంది వీడియోల ద్వారా, కొంతమంది సందేశాల ద్వారా కరోనాను ఎదుర్కోవాలన్న దృఢ సంకల్పాన్ని ప్రజల్లో కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గుఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కరోనా విలయంపై ఓ కవిత రాసి సోసల్ మీడియాలో పోస్ట్ చేసింది.
`నేను భయపడుతున్నాను.. గుండెకు గాయమైంది.. నావాళ్లను తీసుకెళ్లిపోతోంది. నొప్పిలేకుండా మరణానంతర జీవితం వాగ్దానంతో..“ అంటూ తన కవితలో రాసుకొచ్చింది. ఇక చివర్లో మేలో పూలు పూసే గుల్ మొహర్ చెట్టుకింద కూర్చుని ఉన్న దేవుడు ఈ విలయం మొత్తాన్నీ చూస్తునే ఉన్నాడని, అతడికి పేద, ధనిక అనే తేడా లేదంటూ శోభిత తన కవితకు ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చింది.
కాగా.. శోభిత ధూళిపాళ్ల తెలుగులో అడవి శేష్తో గూఢచారి సినిమాలో హీరోయిన్గా పరిచయమైంది. ఇప్పుడు మళ్లీ అడవి శేష్తోనే మేజర్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ కాకపోయినా.. అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా తెలుస్తోంది. అంతర్జాతీయ చిత్రం మంకీ మ్యాన్ లోనూ శోభిత నాయికగా నటిస్తోంది.
స్లమ్ డాగ్ ఫేం దేవ్ పటేల్ కథానాయకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్కు వెళ్లింది. తాజాగా హాలీవుడ్లో కూడా అడుగుపెట్టిందీ అమ్మడు.