క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు ఎంత ప్రేక్షకాదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవలి కాలంలో ఆయన సరైన సక్సెస్లు అందుకోవడంలేదు. ప్రస్తుతం ఓ సాలిడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నారు కృష్ణవంశీ. మరాఠ సూపర్ హిట్ నటసామ్రాట్ను తెలుగు ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే అనౌన్స్ అయిన చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు.
తాజా సమాచారం మేరకు రంగమార్తాండ చిత్రం కోసం చిరంజీవి తన గొంతు అరువుగా ఇస్తున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందుతుండగా, బుల్లితెర బిజీ ఆర్టిస్ట్ అనసూయ కూడా ఈ సినిమాలో కీ రోల్లో నటిస్తున్నారు.
007లో వచ్చిన ‘చందమామ’ సినిమా తరవాత కృష్ణవంశీ ఆ స్థాయి హిట్టు అందుకోలేదు. ఆఖరికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేసిన ఫ్యామిలీ డ్రామా ‘గోవిందుడు అందరివాడేలే’ కూడా వర్కౌట్ కాలేదు. ఇక యంగ్ హీరోలతో చేసిన మల్టీస్టారర్ ‘నక్షత్రం’ పరిస్థితి కూడా అంతే. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి ఫాంలోకి రావాలని కృష్ణవంశీ చూస్తున్నారు.
ThQ annyya for ur generocity n unconditional kindness …one more crowned lightening on #rangamarthandas sky … THE MEGA VOICE…….. @prakashraaj @meramyakrishnan @ShivathmikaR @anusuyakhasba @Rahulsipligunj @AadarshBKrishna @kalipu_madhu pic.twitter.com/mApNqcGvxV
— Krishna Vamsi (@director_kv) October 26, 2021