ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక కథానాయికగా మీనాక్షి చౌదరి .. మరో కథానాయికగా డింపుల్ హయతి కనువిందు చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్ .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ప్రత్యేకమైన పాత్రలో అనసూయ మెరవనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. ‘క్రాక్’ వంటి భారీ హిట్ తరువాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి.