సీనియర్ నటి రేవతి దర్శకురాలిగా ఎంత మంచి పేరు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. నటన, దర్శకత్వంలో రేవతికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్యే నవరస అంటూ వెబ్ సిరీస్లో అదరగొట్టేసింది. కరుణ రసం అనే కాన్సెప్ట్తో వచ్చిన పార్ట్లో రేవతి నటించింది. అయితే తాజాగా రేవతి తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ను ప్రకటించింది. అది కూడా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్తో సినిమా చేయబోతోన్నట్టు తాజాగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన విషయాలు వైరల్ అవుతోన్నాయి.
మిత్ర, మై ఫ్రెండ్ సినిమాతో రేవతి దర్శకురాలిగా మారింది. ఆ తరువాత ఫిర్ మిలేంగె, కేరళ కేఫ్, ముంబై కటింగ్ అనే చిత్రాలను తెరకెక్కించింది. ఇప్పుడు చాలా కాలం తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టనుంది. దాదాపు ఏడేళ్లుగా రాసిన ఈ కథలో కాజోల్ నటించనుందని రేవతి తెలిపింది. కథ విన్న వెంటనే ఓకే చెప్పేశానంటూ కాజోల్ కూడా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.