బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనావైరస్ కంగారు పెట్టిస్తున్నది. ఇప్పటికే పలువురు హిందీ హీరోలకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. గత కొద్దిరోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అనే విషయం రిపోర్టుల్లో తేలింది.
జాతీయ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన ప్రకారం.. అమీర్ ఖాన్కు కోవిడ్-19 పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
గత కొద్ది రోజులుగా అమీర్ ఖాన్తో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సరైన జాగ్రత్తలు పాటించాలి అని అమీర్ ఖాన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అమీర్ ఖాన్ సోషల్ మీడియా నుంచి వైదొలగడంతో ఆయన తరఫున అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.
గతవారం క్రితం అమీర్ ఖాన్ సోషల్ మీడియా నుంచి వైదొలడం అభిమానులను షాక్ గురిచేసింది. ఆ విషయం నుంచి తేరుకోక ముందే అమీర్ ఖాన్కు కరోనా సోకడంతో మరోసారి ఫ్యాన్స్ దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.