అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన 21 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాగా, 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. వీరిలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 30, వైసీపీకి 8, బీజేపీకి 3 సీట్లు రాగా… ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు.