ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ స్టేటస్ పొందిన శృతిహాసన్, విదేశీ నటుడు మైఖేల్ కోర్సేల్తో ప్రేమలో ఉన్న సమయంలో సినీ పరిశ్రమకు దూరమైంది. అయితే తన ప్రియుడితో బ్రేకప్ అప్పడం తో తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టింది. చాలా గ్యాప్ రావడం వల్ల చాలా మంది స్టార్ హీరోలు శ్రుతిహాసన్ ను పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే కొత్త సంవత్సరం శృతిహాసన్ అదృష్టాన్ని పూర్తిగా మార్చేసింది.
చాలా రోజుల తర్వాత బాక్సాఫీసు వద్ద దుమ్ము లేపిన రవితేజ సినిమా క్రాక్ తో శ్రుతిహాసన్ కూడా హిట్ కొట్టింది. ఇది ఇలా ఉండగానే ప్రభాస్, కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తో చేస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పలు భాషల్లో రిలీజ్ అయ్యే ఈ సినిమాతో శృతిహాసన్ కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం ఖాయం.
సలార్ హిట్ ఐతే మాత్రం శృతిహాసన్ స్టార్డమ్ విపరీతంగా పెరిగిపోయి మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం శృతిహాసన్, వకీల్సాబ్ లో పవన్కళ్యాణ్ సరసన నటిస్తోంది.