హాస్యనటుడు సత్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. కె.ఎస్.శినీష్తో కలిసి కథానాయకుడు సందీప్కిషన్ నిర్మిస్తూ… ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. అర్జావీరాజ్ కథానాయిక. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథతో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 27న ఓటీటీ వేదిక సోని లివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ‘‘లాక్డౌన్తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి కొడుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథతో ఆద్యంతం నవ్వించేలా ఈ సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ నవ్వులు పంచింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనివీ, ఛాయాగ్రహణం: మణికందన్.