గత కొన్నేళ్లుగా మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల బడుతున్నాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’, ఆ తర్వాత చేసిన ‘ఓటర్’ సినిమాలు కూడా మంచు విష్ణును తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే ఇపుడు మంచు విష్ణు ఇప్పుడు పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ కథతో ‘మోసగాళ్లు’ సినిమాతో వస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తోంది. ‘మోసగాళ్లు’ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ,తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఈ సినిమాకు సంబందించి పోస్టర్తో పాటు టీజర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు.
Here is the trailer of #Mosagallu ,Based on a true story, one of the biggest IT scams that shook the USA. All the best Dear @iVishnuManchu &
Best wishes to the entire team 💐#Mosagallu Trailer ▶️ (link)https://t.co/7ylGl02i7p— Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2021
మంచు విష్ణు కెరీర్ చూస్తే.. స్టార్ హీరో మోహన్ బాబు కుమారుడిగా పరిచయమై విష్ణు చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్నీ అలరించలేకపోయాయి. అయితే ఆయన చేసిన కొన్ని కామెడీ సినిమాలు ‘ఢీ’, దేనికైనా రెడీ’ ఒకటి రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. గత కొంత కాలంగా రొటిన్ సినిమాలతో మార్కెట్ డౌన్ ఫాల్ అయింది. దీంతో కథల ఎంపికలో మంచు విష్ణు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. దీంతో సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్న విష్ణు.. మోసగాళ్లు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక విష్ణు ఈ సినిమాతో పాటు మరో సినిమాలోను నటిస్తున్నాడు. విష్ణు ప్రధాన పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల బడ్జెట్తో భారీగా తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు ‘భక్త కన్నప్ప’గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలోని నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. మరోవైపు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ ‘అహం బ్రహ్మస్మి’ అనే భారీ పాన్ ఇండియా మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ’మోసగాళ్లు’ చిత్రానికి వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.