రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. రానా కవిత్వానికి ఫిదా అవుతుంది సాయి పల్లవి. ప్రేమ కోసం అన్నీ వదిలేసి రానా దగ్గరకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆమెను చుట్టుముట్టిన సమస్య ఏంటి? రానా కామ్రేడ్గా ఎందుకు మారాడు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. రానా కవిత్వం చెప్పిన తీరు, సాయి పల్లవి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది టీజర్. సురేశ్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Happy to launch #VirataParvamTeaser.
It looks raw and realistic. Great storytelling by @venuudugulafilm. My best wishes to @RanaDaggubati and @Sai_Pallavi92.
Good luck to the entire team @SLVCinemasOffl @SureshProdns. https://t.co/hkcQInKwQz— Chiranjeevi Konidela (@KChiruTweets) March 18, 2021