కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు సెలబ్రిటీలు నడుం బిగించారు. ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రూ. 2 కోట్ల రూపాయలతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం మొదలు పెట్టారు. ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో ఫండ్ రైజింగ్ మొదలు పెట్టిన వీరు వారం రోజులలో రూ. 7 కోట్ల ఫండ్ని సేకరించాలనే టార్గెట్గా పెట్టుకున్నారు. కాని ఐదు రోజులలోనే 7 కోట్లు రావడంతో టార్గెట్ని రూ.11 కోట్లకి విరుష్క జోడీ పెంచింది.
Words fall short to express how overwhelmed we feel to have exceeded our target not once, but twice, thanks to each one of you. To everyone who has donated, shared, & helped in any way, I want to say a big thank you. We are #InThisTogether & we will overcome this together. pic.twitter.com/M7NeqDc532
— Virat Kohli (@imVkohli) May 14, 2021
వారం రోజులు ముగిసే సమయానికి ‘ఇన్ దిస్ టుగెదర్’కి రూ.11,39,11,820 ఫండ్ వచ్చినట్లు విరాట్ కోహ్లీ వెల్లడించాడు. మా పిలుపు మేరకు స్పందించి ఫండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా టార్గెట్ రెండు సార్లు రీచ్ అయినందుకు సంతోషంగా ఉందని విరాట్ దంపతులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కరోనా రోగుల అవసరాలు తీరుస్తున్న యాక్ట్ గ్రాంట్స్ అసోషియేషన్కి ఇవ్వాలని ముందుగానే విరుష్క జోడీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
Virat & I are thankful to MPL Sports Foundation for strengthening our efforts to help India fight the pandemic. Your donation of 5 crore empowers us to keep going and has allowed us to increase our goal to 11 crore.@PlayMPL @actgrants @ketto #InThisTogether #ActNow
— Anushka Sharma (@AnushkaSharma) May 12, 2021