బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ అటవీశాఖ అధికారిగా నటించిన చిత్రం ‘షెర్నీ’. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్’లో జూన్ నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. టీ-సిరీస్, అబుందాంటియా ఎంటర్టైన్మెంట్స్ పతకాలపై సంయుక్తంగా నిర్మితమైంది. కాగా.. ఈ సినిమా విడుదలకు సంబంధించిన వార్తను అమెజాన్ ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘తన మార్కు వేసేందుకు షెర్నీ సిద్ధం.. జూన్లో ఆమెను కలుసుకుందాం’ అంటూ ఆ ట్వీట్లో రాసుకొచ్చింది. ఈ సినిమాలో శరద్ సక్సేనా, ముకుల్ చద్ధా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో షెర్నీ(విద్యాబాలన్) ఒక నిజాయితీ గల అటవీశాఖ అధికారిగా మనిషి-జంతు సంఘర్షణ ప్రపంచంలో సమతల్యత తెచ్చేందుకు పోరాడుతూ ఉంటుంది.