ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా, కరోనా వలన రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అడవి నేపథ్యంలో సాగే ఈ మూవీని ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. అక్టోబర్ 8న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ రీసెంట్గా ప్రకటించారు.
తాజాగా చిత్రానికి కొండ పొలం అనే టైటిల్ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో వైష్ణవ్ తేజ్ మాస్ లుక్లో కనిపిస్తున్నారు.తొలి సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న వైష్ణవ్తేజ్ రెండో సినిమాతోను అలరిస్తాడని చెబుతున్నారు. ‘కొండపొలం’అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా ఈ సినిమాకి అదే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవలా హక్కులను కొని అదే కథతో సినిమా చేసాడు క్రిష్. అడవి జంతువులూ తిరిగే చోట నీరు కూడా దొరకని పరిస్థితుల్లో రైతు జీవనం ఎలా సాగింది అన్న కథతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ తక్కువ రోజుల్లోనే పూర్తి చేసి విడుదల చేస్తున్నారు క్రిష్.