హైదరాబాద్: జగపతిబాబు ప్రధాన పాత్రలో కార్తీక్, అభిరామి జంటగా నటించిన చిత్రం ఎఫ్.సి.యు.కె. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బారసాల పేరుతో ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించింది.
ఈ వేడుకలకు ప్రముఖ హాస్యనటుడు సునీల్ తోపాటు యూట్యూబ్ లో గుర్తింపు పొందిన వారంతా హాజరై సందడి చేశారు. ప్రధానంగా వేదికపై టిక్టాక్ స్టార్ దుర్గారావుతో కలిసి జగపతిబాబు నృత్యం చేయడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఎఫ్.సి.యు.కె.సినిమా తొలి టికెట్ను నటుడు సునీల్ వెయ్యి రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం.