తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోగ్రాం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక తన మీద ఎక్కువగా విమర్శలు వినిపించాయని అన్నారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న సమయంలో ప్రతి పక్షం వాళ్లు మురళీమోహన్ గోదావరిలో ఇసుక అమ్మేసి కోట్లు సంపాదిస్తున్నాడు అని విమర్శించారని అన్నారు.
ఒరేయ్ పిచ్చి నా కొడకా మా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఇసుక కూడా బయట మార్కెట్లో కొనుక్కున్నాను అని ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని అందులో ముఖ్యంగా మందు తాగ కూడదు అని గ్యాంబ్లింగ్ ఆడకూడదని అలాగే లవ్ ఎఫైర్స్ సెకండ్ హౌస్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.
ఇక రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని మురళీ మోహన్ పశ్చాత్తాప పడ్డారు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమేనని పేర్కొన్న ఆయన తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్విన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకు వచ్చారని అన్నారు. ఇక ఎన్నికల నుంచి తప్పుకున్న ఆయన రాజకీయాలంటే విరక్తి కలిగేలా చేశారని కామెంట్స్ కూడా చేశారు. మరి రాబోతున్న పూర్తి ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.