సుశాంత్ బంధువుపై కాల్పులు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కజిన్ రాజ్కుమార్ సింగ్ వాహనాల డీలర్గా వ్యవహరిస్తున్నారు. సహర్సా, మాధేపూర్, సుపౌల్ జిల్లాలో ఆయనకు యమహాకు సంబంధించిన షోరూంలు ఉన్నాయి. ప్రతీ రోజు షోరూంలను సందర్శిస్తూ బిజినెస్ వ్యవహారాలు చూసుకొంటారు. సోమవారం ఉదయం మాధేపూరా ప్రాంతానికి చేరుకోగానే ముగ్గురు అగంతకులు రాజ్కుమార్, అతడి సిబ్బందిపై కాల్పులు జరిపారు అని జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
విషమ పరిస్థితుల్లో బాధితులు తుపాకి కాల్పుల్లో గాయపడిన రాజ్కుమార్ను, అతడి సిబ్బంది ఆలీ హాసన్ను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఆలీ హాసన్ పరిస్థితి విషమంగా ఉంది. రాజ్కుమార్కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. వీరికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు అని జిల్లా ఎస్పీ లిపి సింగ్ స్పషీకరించారు.
ఆస్తి తగదాలే కారణం అంటూ గత కొద్దికాలంగా రాజ్కుమార్కు ఇతరులతో ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ విభేదాల్లో భాగంగానే అగంతకులు కాల్పులు జరిపి ఉంటారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను మీడియాకు అందిస్తాం అని లిపి సింగ్ పేర్కొన్నారు.
కాల్పుల వెనుక కుట్రను బయటపెడుతాం రాజ్కుమార్పై కాల్పుల ఘటనకు ఆస్తులకు సంబంధించిన గొడవలా? లేదా డబ్బుల వసూలుకు పాల్పడే స్థానిక మాఫియా కాల్పులు జరిపి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించాం. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాం. కాల్పలు ఘటన వెనుక కుట్రను బయటపెడుతాం అని లిపి సింగ్ పేర్కొన్నారు.