కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైన సినీ విమర్శకుడు, ప్రముఖ నటుడు కత్తి మహేశ్ శనివారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో చాలా మంది సెలెబ్రిటీలు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం ఆయనను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!
కత్తి మహేశ్కు వివాదాస్పద నటి శ్రీరెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఆమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో ఆయన ఎంతగానో మద్దతు తెలిపారు. అలాగే, ఇద్దరూ కలిసి ఒకే వర్గాన్ని టార్గెట్ చేయడంతో బంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ మరణంపై ఆమె తొలిసారి స్పందించింది. ఈ మేరకు ఫేస్బుక్లో సంచలనమైన పోస్ట్ చేసింది.
కత్తి మహేశ్ మరణించినా ఇంకా ఆయనపై ట్రోల్స్ చేస్తున్న వాళ్లపై నటి శ్రీరెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయింది. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ‘అందరు వెనక, ముందు పోవాల్సిందే. కత్తి మహేష్ మరణాన్ని కూడా పండగలా చెప్పుకునే వాళ్ళకు, అపహాస్యం చేసేవాళ్ళకు ఇదే నా ఆన్సర్. రేపో ఎల్లుండో మీరు కూడా పోవాలి.. మీ హీరో కూడా పోతాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇదే పోస్టులో శ్రీరెడ్డి మరిన్ని కామెంట్లు చేసింది. ‘మీరేదో యుగపురుషులు లాగా ఎందుకురా ఫోజులు? అప్పుడప్పుడూ మీ బుర్రలను వాడుతూ ఉండండి. ఇప్పుడైతే ఆయన ఆత్మకు శాంతి చేకూరనివ్వండి’ అని పేర్కొంది. శ్రీరెడ్డి చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. దీంతో చాలా మంది ఆమెకు అనుకూలంగా కామెంట్లను కూడా పెడుతున్నారు.